విజ్ఞాన భాండాగారాలు మన కళలు వాటిని కాపాడుకోవాలి భారత గౌరవ 13 ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచన…
స్వర్ణభారత్ ట్రస్టులో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులకు ముప్పవరపు ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు.. వెంకటాచలం :- భారతదేశ అస్తిత్వం వెనుక మన భాష, మన సంస్కృతి, మన కళారూపాలు ప్రధాన పాత్ర పోషించాయని, మన వారసత్వాన్ని ,ఆచార వ్యవహారాలను మన పెద్దలు కళల్లోనే నిక్షిప్తం చేశారని భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్ట్ నెల్లూరు చాప్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరి’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నమయ్య కీర్తనలను అద్భుతంగా ఆలపించిన శ్రీ గరిమెళ్ళ అనిల్ కుమార్ను అభినందించారు. అన్నమయ్య సంకీర్తనల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన దివంగత గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ స్మృతికి




